Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సౌత్ హీరోయిన్...

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (12:31 IST)
దక్షిణాది సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్లలో మంజిమా మోహన్ ఒకరు. సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అయితే, ఈమె ఓ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడిందట. 
 
ఇదే అంశంపై ఆమె సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. కొన్ని వారాల క్రితం తన జీవితంలో ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోగా, కాలికి బలమైన గాయం తగిలినట్టు చెప్పింది. 
 
దీనివల్ల కాలికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని, మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని చెప్పింది. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టమైన ఘటన ఏదని చాలా మంది అడిగారని, ఇప్పుడు దానికి సమాధానం తన వద్ద ఉందని చెప్పుకొచ్చింది.
 
తనకెంతో ఇష్టమైన నటనకు కొంతకాలం దూరంగా ఉండాల్సి వస్తోందని చెప్పింది. కారణం లేకుండా ఏదీ జరగదని నమ్ముతున్నానని, తనకు లభించిన ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటున్నానని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments