Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయనితో మణిశర్మ తనయుడి వివాహం..

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (20:44 IST)
Manisharma son
మెలోడీ బ్రహ్మగా పిలవబడే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు, యువ సంగీత దర్శకుడు అయిన మహతి స్వరసాగర్ ఇప్పుడు ఒక ఇంటివాడు అయ్యారు. "ఛలో", "భీష్మ", "మాస్ట్రో" వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి యువ సంగత దర్శకుడిగా, తండ్రికి తగ్గ తనయుడుగా మహతి తన ప్రతిభను చాటేశారు. మహతి స్వర సాగర్ నిశ్చితార్థం నిన్న గాయని సంజన కలమంజతో జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకి దగ్గర స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే విచ్చేశారు.
 
ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంజనా కలమంజే కూడా ప్రముఖ గాయని. తెలుగు, తమిళ్, మలయాళ భాషల చిత్రాలలో చాలానే పాటలు పాడారు. మూడు భాషల్లోనూ గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న సంజన, సాగర్ సంగీతం అందించిన భీష్మ లో "హేయ్ చూసా" పాటను పాడింది. ఇక వీరిది ప్రేమ వివాహమా? కాదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా జరగబోతుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments