మంచు మనోజ్‌ పెండ్లి ఎక్కడో తెలుసా! మోహన్‌బాబు గైర్హాజరు కానున్నారా!

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (16:45 IST)
jubli hils house and manchu family
ఇప్పుడు రెండు ఆసక్తివిషయాలు సినిమా రంగంలోని మంచు ఫ్యామిలీలో జరగబోతున్నాయి. మంచు విష్ణు వివాహ వార్షికోత్సవం, మరోటీ మనోజ్‌ ద్వితీయ వివాహం. ఈనెల 3వ తేదీన మంచుమనోజ్‌ ద్వితీయ వివాహం టిడిపి నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డితో జరగబోతోంది. ఆర్భాటంగా జరగనున్నదని వార్తలు వచ్చినా పరిమిత కుటుంబీకుల సమక్షంలో జరగనుందని తెలుస్తోంది. పెండ్లి ఎక్కడనేది ఆసక్తిగా మారింది. ఆ ప్లేస్‌ ఎక్కడంటే, జూబ్లీహిల్స్‌లోని ఇంతకుముందు మంచు మోహన్‌బాబు నివాసం వుండే ఇల్లే. ఇప్పుడు అందులో లక్ష్మీప్రసన్న, మనోజ్‌ కలిసి వుంటున్నారు. మౌనికా రెడ్డి కూడా అక్కడే సహజీవనం చేస్తుందని గుసగుసలు కూడా ఫిలింనగర్‌లో కొంతకాలంగా వినిపించాయి.
 
ఇప్పుడు ఆ ఇంటిలో పెండ్లి సందడి మొదలైంది. గత రెండురోజులుగా ఆ ఇంటిని అలంకరించే పనిలో సిబ్బంది వున్నారు. ఇప్పటికే ద్వారాల దగ్గర పెద్ద పెద్ద మాలలు అలంకరించి లోపలలకు మండపంకు సంబంధించిన వస్తువులను చేరుస్తున్నారు. అపోలోకు వెళ్ళే దారికావడంతో ఫిలింనగర్‌లో సెంటర్‌ భాగం కావడంతో ఇప్పటికే ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడిరది. 
 
ఇదిలా వుండగా, మంచు మోహన్‌బాబు, విష్ణు ఈ వివాహానికి రారనే వార్త ప్రబలంగా వినిపిస్తుంది. మనోజ్‌ గతంలోనే ఆస్తిపంపకాల విషయంలో గొడవ పడ్డాడని మోహన్‌బాబు సన్నిహితులు తెలియజేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలవల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలకు చెందిన కుటుంబంతో వియ్యం అందడం ఇష్టంలేదని తెలుస్తోంది. ఇప్పటికే జగన్‌ కుటుంబానికి చాలా దగ్గరైన మోహన్‌బాబు ఇటీవలే లండన్‌ వెళ్ళారు. కానీ ఆయన తిరిగి వచ్చినట్లు దాఖలాలు లేవు. కొందరైతే నేరుగా తిరుపతి వెళ్ళి అక్కడే యూనివర్శిటీ పనుల్లో బిజీగా వున్నారని చెబుతున్నారు. ఇక మంచు విషుకూడా అదే రోజు వెడ్డింగ్‌ యానివర్శీ జరుపుకోనున్నారు. లక్ష్మీ ప్రసన్న మనోజ్‌ వివాహ వేదుకలను పర్యవేక్షించడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments