మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ... ''చాలెంజింగ్ పాత్ర చేస్తున్నాను. ఎగ్జయిటింగ్ సబ్జెక్ట్. ఇప్పటివరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్ జడ్జ్ పాత్రలో కనపడతాను సింగిల్ షెడ్యూల్లో ఏకధాటిగా సినిమా షూటింగ్ను పూర్తి చేశాం. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ను తమ్ముడు మనోజ్ ఆధ్వర్యంలో చేశాం. డైరెక్టర్ కార్తికేయ గోపాలకృష్ణ సినిమాను బాగా తెరకెక్కించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దీపావళి ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని అన్నారు.
చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్ రెడ్డి మాట్లాడుతూ, ''పవర్ఫుల్ సబ్జెక్టుతో, మంచి ఎమోషన్స్తో లక్ష్మీ బాంబ్ సినిమాను రూపొందించాం. అనుకున్న ప్లానింగ్లో సినిమా పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచు లక్ష్మీని చాలా కొత్త రకంగా ప్రజెంట్ చేసే సినిమా. ఫైట్స్, సాంగ్స్ హైలెట్ అవుతాయి. మంచి టీం కుదిరింది. సినిమాను అనుకున్న ప్లానింగ్లో పూర్తి చేస్తున్నాం. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ను మనోజ్ నేతృత్వంలో చేయడం ఆనందంగా ఉంది.
అందుకు ఆయనకు థాంక్స్ సెప్టెంబరులో ఆడియో రిలీజ్ చేసి అక్టోబరులో దీపావళి సందర్భంగా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జయప్రద 'జస్టిస్ రుద్రమదేవి' తర్వాత అంతటి పవర్ఫుల్ రోల్ చేస్తుంది లక్ష్మీగారే. మనోజ్ క్లైమాక్స్ ఫైట్ కంపోజ్ చేయడం ఎసెట్ అవుతుంది. నిర్మాతలు సురేష్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. సెప్టెంబరులో సినిమాను ఆడియో రిలీజ్ చేసి దీపావళి సందర్భంగా మా లక్ష్మీ బాంబ్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు.