చిరంజీవి అంకుల్.. మిమ్మలను చూసి ఈర్ష్యపడుతున్నా.. మంచు లక్ష్మీ

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (12:25 IST)
మెగాస్టార్ చిరంజీవిని చూస్తే నిజంగానే చాలా మందికి ఈర్ష్య కలుగుతుంది. ఎందుకంటే.. ఆరు పదుల వయస్సులోనూ నిత్య విద్యార్థిగా ఉంటాడు. తాను చేసే ప్రాజెక్టులు కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. పైగా, తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరితోనూ స్నేహభావంతో మెలుగుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఆశాజశత్రువు చిరంజీవి. అందుకే చిరంజీవిని చూస్తే ప్రతి ఒక్కరికీ ఈర్ష్య కలుగుతుంది. ఇపుడు ఈ జాబితాలో మంచు లక్ష్మి కూడా చేరిపోయింది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. అదేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
ఇటీవల లెజెండ్రీ యాక్టర్స్‌ చిరంజీవి, మోహన్‌బాబు కలిసి సిక్కింకు వీకెండ్‌ ట్రిప్‌ వెళ్లారు. ఈ విషయాన్ని మోహన్‌బాబు కుమార్తె, నటి మంచు లక్మి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. "ఇద్దరు మాస్ట్రోలు సిక్కింకు శీఘ్ర పర్యటనకు వెళ్ళినప్పుడు.. అదొక ఫైరింగ్‌ న్యూస్‌ అవుతుందని మీకు తెలుసు. చిరంజీవి అంకుల్‌.. మీరు మాత్రమే నాన్నను వీకెండ్‌ క్విక్‌ ట్రిప్‌లో సిక్కింకు వెళ్లడానికని ఒప్పించగలిగారు. 
 
మిమ్మల్ని చూసి నేను ఈర్ష్య పడుతున్నాను. మీరు కలిసి అద్భుతమైన క్షణాలను గడపటం చాలా ఆనందాన్నిచ్చింది. హృదయం సంతోషంతో నిండిపోయింది. మీరు, పిల్లలు కలిసి ఓ రోజు ఇలాంటి ట్రిప్‌కు వెళదాం" అని అంటూ మంచు లక్ష్మి చిరంజీవి, మోహన్‌బాబు కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా షేర్‌ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments