Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్' చిత్ర బృందం కీలక నిర్ణయం - ఆ సంభాషణలు తొలగింపు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (09:07 IST)
ప్రభాస్ - కృతి సనన్ జంటగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. గత శుక్రవారం విడుదలైన టాక్‌తో నిమిత్తం లేకుండా కలెక్షన్ల పరంగా దూసుకెళుతుంది. అదేసమయంలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. చరిత్రని వక్రీకరించారని, పాత్రల ఔచిత్యం దెబ్బతిన్నదని, దుస్తుల ఎంపిక కూడా బాగాలేదన్న కామెంట్లు వినిపించాయి. హనుమంతుడు పలికిన కొన్ని సంభాషణలపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై చిత్ర బృందం స్పందించింది. వివాదాస్పదమైన సంభాషణలు తొలగిస్తామని ప్రకటించింది. 
 
'ఆదిపురుష్' రచయిత మనోజ్ శుక్లా వివరణ ఇస్తూ 'ప్రేక్షకుల మనోభావాల్ని మేం గౌరవిస్తున్నాం.. అందుకే మా టీమ్ అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకొంది. కొన్ని సంభాషణలను తొలగిస్తున్నాం. ఈ సినిమా కోసం నేను నాలుగు వేల పంక్తుల సంభాషణలు రాశాను. అందులో ఐదారు సంభాషణల్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. శ్రీరాముడు, సీత, హనుమాన్‌ల విశిష్టతని చెబుతూ ఎన్నో మంచి మాటలు, పాటలూ రాశాను. కానీ వాటితో పోలిస్తే ఈ నాలుగు మాటలే ఎక్కువ ప్రభావం చూపించాయనిపిస్తోంది. చాలా మంది నన్ను ఘోరంగా తిడుతున్నారు. కానీ నేను వాటిని పట్టించుకోవడం లేదు అని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments