Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గీత గోవిందం' దర్శకుడితో మహేష్...

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (13:11 IST)
చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్లు... మహేష్ బాబు తన చేసిన 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' సినిమాలు ప్లాప్ అయిన తర్వాత తనతో సినిమా చేయాలనుకునే దర్శకులు ఎవరైనా పూర్తి స్క్రిప్టుతో వచ్చి, అది తనకు నచ్చితేనే సినిమా చేసేందుకు మహేష్ ఓకే చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. తన చేయబోయే సినిమా విషయంలో మహేష్ పాటిస్తున్న కఠిన నిబంధన ఇది. 
 
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చేస్తున్న మహేష్‌కి... దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఓకే అయింది. ఈ సంవత్సరం చివరి వరకు సినిమా పూర్తిచేసి వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది అనిల్ ప్లాన్. ఈ రెండింటి తర్వాత ఏ సినిమా చేస్తారు అనే విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. 
 
రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుందనే వార్తలు వచ్చినప్పటికీ... అవి ఎంతవరకు నిజమో తెలియదు. అయితే తాజాగా 'గీతగోవిందం' దర్శకుడు పరశురామ్ రీసెంట్‌గా మహేష్ బాబును కలిసి ఓ లైన్ వినిపించాడట. లైన్ బాగుంది డెవలప్ చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. 
 
లైన్ డెవలప్ చేసి పూర్తి స్క్రిప్టుతో వచ్చి మహేష్‌ను మెప్పిస్తే.. సినిమా చేసే అవకాశం వస్తుంది. లేదంటే.. లేనట్టే. ఒకవేళ పరశురామ్ మహేష్‌ను ఒప్పించగలిగితే.. ఈ సెన్సేషనల్ జోడీ మరో సూపర్ హిట్ ఇవ్వనున్నారో... మొత్తం మీద ఏం జరగనుందో వేచి చూద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments