మహేశ్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కే చిత్రం కథ ఇదేనా?

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (18:28 IST)
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న‌ చిత్రంలో కొంత భాగం 18వ శతాబ్దంతో సెట్ చేయబడిన పిరియాడిక్ డ్రామాగా ఉంటుందని తెలుస్తొంది. ఇందులో 200కు పైగా విభిన్న రూపాలతో కూడిన పాత్రలు కనిపిస్తాయని, ప్రత్యేక గిరిజన తెగలకు చెందినవిగా అవి ఉంటాయని సమాచారం. దీనికోసం అప్పటి మానవుల రూపాల స్కెచ్‌లను సిద్ధం చేయిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో వాటిని ఖరారు చేయనున్నారు. 
 
హీరో మహేశ్ బాబు సైతం ఈ సినిమా కోసం మల్టీపుల్ లుక్స్‌లో కనిపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం‌ రాజమౌళి మహేశ్ లుక్స్‌ను ఎంపిక చేసె పనిలో ఉన్నారు. ఈ సినిమా కోసం అటు ఫిలిం సిటీ‌లో‌ ఇటు అల్యూమినియం ప్యాక్టరీలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. తదుపరి వర్క్ షాప్‌ల నిర్వహణ ఉంది. ఇలా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కోసం కావలసినంత సమయాన్ని కేటాయించాలని టీమ్ భావించిన తరుణంలో 2025లోనే ఈ సినిమా చిత్రీకరణకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి రెండో వారంలో షూటింగ్ ప్రారంభం‌కావచ్చని తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తను చనిపోయినట్లు టీవీలో వస్తున్న వార్తను చూస్తున్న నటుడు ధర్మేంద్ర, ఇంతకన్నా దారుణం ఏముంటుంది?

డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ: అద్భుతమైన బోధకురాలు ఉగ్రవాదిగా ఎలా మారిపోయింది?!

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments