Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆట సూస్తావా.." అంటున్న మహేశ్ బాబు.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్

ఠాగూర్
సోమవారం, 8 జనవరి 2024 (09:11 IST)
సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "గుంటూరు కారం". హారిక హాసిని బ్యానరుపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. ఇందులో మహేశ్ బాబు మాస్ హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం రాత్రి విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్ చూస్తే... మాస్ హీరోగా ఇంతవరకూ మహేశ్ బాబు చేసిన సినిమాలు ఒక లెక్క .. ఈ సినిమా ఒక లెక్క అన్నట్టుగా త్రివిక్రమ్ ఈ సినిమాలో ఆయనను చూపించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
 
ఈ ట్రైలర్‌ను వదిలారు. మహేశ్ బాబు పాత్రను ఎలా డిజైన్ చేశారనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. మహేశ్ బాబు సింపుల్ డైలాగ్స్ .. 'ఆట సూస్తావా' అనే ఆయన మేనరిజం .. పండు మిరపకాయలు ఆరబోసిన ప్లేస్‌లో జరిగే ఫైట్ హైలైట్‌గా కనిపిస్తున్నాయి. ఇక శ్రీలీలను చూస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
 
మొత్తం మీద ఈ ట్రైలర్‌తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాలనే టీమ్ ప్రయత్నం ఫలించేలానే కనిపిస్తోంది. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రమ్యకృష్ణ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తున్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కోసమే మహేశ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం.. అమలు ఎప్పటి నుంచంటే...

మాజీ సీఎం కేసీఆర్ షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేకే!!

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం - విచారణలో కదలిక...

నీ అంతు చూస్తా... ఎమ్మెల్యే కొండబాబుకి ద్వారంపూడి అనుచరుడు భళ్లా సూరి వార్నింగ్ (video)

ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కకు పెట్టిన మెసేజ్ ఆధారంగా గుర్తింపు!! తేజస్వి ఆచూకీ తెలిసిందిలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments