Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆట సూస్తావా.." అంటున్న మహేశ్ బాబు.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్

ఠాగూర్
సోమవారం, 8 జనవరి 2024 (09:11 IST)
సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "గుంటూరు కారం". హారిక హాసిని బ్యానరుపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. ఇందులో మహేశ్ బాబు మాస్ హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం రాత్రి విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్ చూస్తే... మాస్ హీరోగా ఇంతవరకూ మహేశ్ బాబు చేసిన సినిమాలు ఒక లెక్క .. ఈ సినిమా ఒక లెక్క అన్నట్టుగా త్రివిక్రమ్ ఈ సినిమాలో ఆయనను చూపించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
 
ఈ ట్రైలర్‌ను వదిలారు. మహేశ్ బాబు పాత్రను ఎలా డిజైన్ చేశారనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. మహేశ్ బాబు సింపుల్ డైలాగ్స్ .. 'ఆట సూస్తావా' అనే ఆయన మేనరిజం .. పండు మిరపకాయలు ఆరబోసిన ప్లేస్‌లో జరిగే ఫైట్ హైలైట్‌గా కనిపిస్తున్నాయి. ఇక శ్రీలీలను చూస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
 
మొత్తం మీద ఈ ట్రైలర్‌తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాలనే టీమ్ ప్రయత్నం ఫలించేలానే కనిపిస్తోంది. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రమ్యకృష్ణ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తున్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కోసమే మహేశ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments