Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ మహేష్ బాబు-పూజా హెగ్డె జంటగా త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:12 IST)
మహేష్ బాబు 28వ చిత్రం ‘SSMB 28’ గురువారం హైదరాబాద్‌లో ‘ముహూర్తం’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కమర్షియల్ యాక్షన్ డ్రామాగా చెప్పబడుతున్న కొత్త వెంచర్ కోసం మహేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జతకట్టారు.

 
భారీ అంచనాల మధ్య లాంచ్ అయిన చిత్రం వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు ట్విట్టర్‌లో వచ్చాయి. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు రాలేదు. ఆయన తరపున ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’లో కనిపించనున్న నటి పూజా హెగ్డే మహేష్ బాబుతో ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మహేష్ బాబు క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

 
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ఇతర సాంకేతిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ‘SSMB28’ ఈ మార్చిలో సెట్స్‌పైకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments