Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ మహేష్ బాబు-పూజా హెగ్డె జంటగా త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:12 IST)
మహేష్ బాబు 28వ చిత్రం ‘SSMB 28’ గురువారం హైదరాబాద్‌లో ‘ముహూర్తం’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కమర్షియల్ యాక్షన్ డ్రామాగా చెప్పబడుతున్న కొత్త వెంచర్ కోసం మహేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జతకట్టారు.

 
భారీ అంచనాల మధ్య లాంచ్ అయిన చిత్రం వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు ట్విట్టర్‌లో వచ్చాయి. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు రాలేదు. ఆయన తరపున ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’లో కనిపించనున్న నటి పూజా హెగ్డే మహేష్ బాబుతో ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మహేష్ బాబు క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

 
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ఇతర సాంకేతిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ‘SSMB28’ ఈ మార్చిలో సెట్స్‌పైకి రానుంది.

సంబంధిత వార్తలు

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

సిగ్నల్ జంప్ చేసి ఎక్స్‌ప్రెస్ రైలను ఢీకొన్న గూడ్సు రైలు.. 15కి పెరిగిన మృతులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన... త్వరలో ప్రారంభం

19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్

లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన అన్నాడీఎంకే... రీఎంట్రీకి ఆసన్నమైందంటున్న శశికళ!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments