Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలీజ్‌కు ముందే "మహర్షి" నిర్మాతలకు కాసులపంట

Webdunia
బుధవారం, 8 మే 2019 (12:46 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "మహర్షి". ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. వంశీ పైడివల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సి.అశ్వినీదత్, పొట్లూరు వరప్రసాద్‌లు కలిసి సంయుక్తంగా నిర్మించారు. 
 
శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో సుమారు 400 స్క్రీన్లపై రిలీజ్ కానుంది. పైగా, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో రూ.150 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఒక్క తెలుగు హక్కులే రూ.100 కోట్లను సంపాదించి పెట్టాయి. ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కానీ, ఈ చిత్రం ప్రిరిలీజ్ బిజినెస్ మాత్రం ఇప్పటికే రూ.150 కోట్ల మేరకు తెచ్చిపెట్టింది. ఇక చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంటే మాత్రం నిర్మాతల పంట పండినట్టేనని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

Yoga Day: యోగా తర్వాత అల్పాహారం- తోపులాట-స్పృహ కోల్పోయిన విద్యార్థిని

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments