Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానటి'' విడుదల అప్పుడే.. సావిత్రి చివరి రోజులు మాత్రం..?

''మహానటి'' విడుదల తేదీని సినిమా యూనిట్ వెల్లడించింది. సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నాదత్ నిర్మాణంలో రూపొందుతుంది. మిక్కీ జేయ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (13:45 IST)
''మహానటి'' విడుదల తేదీని సినిమా యూనిట్ వెల్లడించింది. సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నాదత్ నిర్మాణంలో రూపొందుతుంది. మిక్కీ జేయ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతుందని ట్విట్టర్ ద్వారా సినిమా యూనిట్ ప్రకటించింది. 
 
తెలుగు తెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసుకున్న‌ అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే గ్రాఫిక్స్ ప‌నుల‌తో పాటు చిత్రానికి సంబంధించిన కొన్ని ప‌నులు పూర్తి కాక‌పోవ‌డంతో సినిమాను మే 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు సినీ యూనిట్ ప్రకటించింది. విడుదల తేదీతో పాటు సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కీర్తి సురేష్ లుక్ సూపర్బ్ అనేలా వుంది. 
 
ఇకపోతే, మహానటిలో సావిత్రి పాత్ర‌ని కీర్తి సురేష్ పోషిస్తుండ‌గా, జమునగా సమంత, ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. షాలిని పాండే, ప్రకాశ్ రాజ్, త‌రుణ్ భాస్క‌ర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఏఎన్ఆర్‌గా చైతూ న‌టిస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కాగా సావిత్రి కుటుంబ స‌భ్యుల అభ్యర్థన మేరకు సావిత్రి జీవితంలో చివరి రోజులు చూపించరని తెలుస్తోంది. కాక‌పోతే చివ‌రి రోజుల‌లో సావిత్రి చాలా బాధ‌ల‌కి గురైంద‌ని మాత్రం కార్డ్ ద్వారా చెప్తార‌ని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments