Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన 'మహానటి' చిత్రానికి అరుదైన గౌరవం...

Webdunia
శనివారం, 4 మే 2019 (20:58 IST)
మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్లో సి.అశ్వినీ దత్ కుమార్తెలు నిర్మించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా ఈ చిత్రం  నాగ్ అశ్విన్‌కు ఓ ప్రత్యేక స్థాయిని తెచ్చిపెట్టింది. విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకుంది. 
 
అంతేకాదు ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ అయితే నిజంగా సావిత్రి గారిలా పరకాయ ప్రవేశం చేశారా అన్న రీతిలో నటించి, నటనలో తనకు తనే సాటి అన్న రీతిగా సావిత్రి పాత్రలో జీవించి తెలుగు ప్రేక్షకుల మన్నలను పొందింది. అయితే తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.
 
షాంగైలో జరుగుతున్న షాంగై ఫిలిం ఫెస్టివల్‌కు ఈ సినిమా ఎంపికైంది. ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా మహానటి సినిమాను మెయిన్ ల్యాండ్‌లో  ప్రదర్శించనున్నారు. గతేడాది మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత అక్కినేనిలతో పాటు దక్షిణాది భాషలకు చెందిన అనేకమంది నటీనటులు ఈ సినిమాలో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments