Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన 'మహానటి' చిత్రానికి అరుదైన గౌరవం...

Webdunia
శనివారం, 4 మే 2019 (20:58 IST)
మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్లో సి.అశ్వినీ దత్ కుమార్తెలు నిర్మించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా ఈ చిత్రం  నాగ్ అశ్విన్‌కు ఓ ప్రత్యేక స్థాయిని తెచ్చిపెట్టింది. విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకుంది. 
 
అంతేకాదు ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ అయితే నిజంగా సావిత్రి గారిలా పరకాయ ప్రవేశం చేశారా అన్న రీతిలో నటించి, నటనలో తనకు తనే సాటి అన్న రీతిగా సావిత్రి పాత్రలో జీవించి తెలుగు ప్రేక్షకుల మన్నలను పొందింది. అయితే తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.
 
షాంగైలో జరుగుతున్న షాంగై ఫిలిం ఫెస్టివల్‌కు ఈ సినిమా ఎంపికైంది. ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా మహానటి సినిమాను మెయిన్ ల్యాండ్‌లో  ప్రదర్శించనున్నారు. గతేడాది మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత అక్కినేనిలతో పాటు దక్షిణాది భాషలకు చెందిన అనేకమంది నటీనటులు ఈ సినిమాలో నటించారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments