Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మహాభారత్" సీరియల్ భీముడు ఇకలేరు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (16:28 IST)
దేశాన్ని ఉర్రూతలూగించిన "మహాభారత్" సీరియల్‌లో భీముడి పాత్రధారి ప్రవీణ్ కుమార్ సోబ్తి ఇకలేరు. ఈయన వయసు 74 యేళ్లు. ఢిల్లీలోని అశోక్ విహార్‌లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టు కారణంగా సోమవారం రాత్రి 10.30 గంటల సయమంలో తుది శ్వాస విడిచారు. 
 
గత కొంతకాలంగా గుండె నొప్పితో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఫ్యామిలీ వైద్యుడిని ఇంటికి పిలిపించారు. అప్పటికే చేయిదాటిపోయింది. 
 
ఈయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు.. ఒక గొప్ప అథ్లెట్ కూడా. పలు ఈవెంట్లలో ఆయన హ్యామర్ థ్రో, డిస్కస్ థ్రో విభాగాల్లో మన దేశానికి ప్రాతినిథ్యం కూడా వహించారు. ఆసియా క్రీడల్లో ఆయన నాలుగు పతకాలను సాధించాడు. 1966, 1970 పోటీల్లో రెండు బంగారు పతకతాలను  గెలుచుకున్నారు. 
 
1988లో బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారత్ సీరియల్‌తో ఆయన తన యాక్టింగ్ కేరీర్‌ను ప్రారంభించారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments