Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మహాభారత్" సీరియల్ భీముడు ఇకలేరు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (16:28 IST)
దేశాన్ని ఉర్రూతలూగించిన "మహాభారత్" సీరియల్‌లో భీముడి పాత్రధారి ప్రవీణ్ కుమార్ సోబ్తి ఇకలేరు. ఈయన వయసు 74 యేళ్లు. ఢిల్లీలోని అశోక్ విహార్‌లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టు కారణంగా సోమవారం రాత్రి 10.30 గంటల సయమంలో తుది శ్వాస విడిచారు. 
 
గత కొంతకాలంగా గుండె నొప్పితో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఫ్యామిలీ వైద్యుడిని ఇంటికి పిలిపించారు. అప్పటికే చేయిదాటిపోయింది. 
 
ఈయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు.. ఒక గొప్ప అథ్లెట్ కూడా. పలు ఈవెంట్లలో ఆయన హ్యామర్ థ్రో, డిస్కస్ థ్రో విభాగాల్లో మన దేశానికి ప్రాతినిథ్యం కూడా వహించారు. ఆసియా క్రీడల్లో ఆయన నాలుగు పతకాలను సాధించాడు. 1966, 1970 పోటీల్లో రెండు బంగారు పతకతాలను  గెలుచుకున్నారు. 
 
1988లో బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారత్ సీరియల్‌తో ఆయన తన యాక్టింగ్ కేరీర్‌ను ప్రారంభించారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments