Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రీతనయులు నటించిన "మహాన్" ట్రైలర్ రిలీజ్

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (14:35 IST)
విలక్షణ నటుడు విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ కలిసి నటించిన చిత్రం "మహాన్". కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. తమిళంలో మహాన్ పేరు పెట్టగా, తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్ చేయనున్నారు. నిజజీవితంలో తండ్రీతనయులైన విక్రమ్, ధృవ్ విక్రమ్‌లు ఈ చిత్రంలో కూడా తండ్రీ తనయులుగా నటించారు. 
 
దీంతో ఆయన అభిమానులు ఎంతగానో ఆనందపడ్డారు. అయితే, వారి ఆశలను అడియాశలు అయ్యాయి. ఈ చిత్రాన్ని థియేటర్‌‍లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ నెల 10వ తేదీన అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేశారు. ఇందులోభాగంగానే ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఇందులో వాణీ భోజన్, సిమ్రాన్‌లు హీరోయిన్లుగా నటించగా, బాబీ సింహా కీలక పాత్రను పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై నిర్మాత లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments