Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ప్రేమమ్'' మడోన్నా సెబాస్టియన్.. గాయనిగా కెరీర్ ప్రారంభించి.. హీరోయిన్ అయ్యింది.. కానీ?

గాయనిగా పాటలు పాడుకున్న ఓ యువతి.. వూహించని విధంగా నటిగా మారింది. ఆమె ఎవరో కాదు.. ప్రేమమ్‌లో మూడో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్. ప్రేమమ్ సినిమాలో చివరిగా మడోన్నా సెబాస్టియన్‌నే రీల్ లైఫ్‌లో నాగ చైతన్య వ

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:51 IST)
గాయనిగా పాటలు పాడుకున్న ఓ యువతి.. వూహించని విధంగా నటిగా మారింది. ఆమె ఎవరో కాదు.. ప్రేమమ్‌లో మూడో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్. ప్రేమమ్ సినిమాలో చివరిగా మడోన్నా సెబాస్టియన్‌నే రీల్ లైఫ్‌లో నాగ చైతన్య వివాహం చేసుకుంటాడు. సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నా.. ప్రాణప్రదమైన సంగీతాన్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని మడోన్నా సెబాస్టియన్ తేల్చి చెప్పింది. సినీ షూటింగ్‌ల్లో పాల్గొంటూనే మధ్య మధ్యలో తన గాత్రంతో శ్రోతలను అలరిస్తోంది. 
 
మలయాళ 'ప్రేమమ్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమైన నటి, గాయని మడోన్నా సెబాస్టియన్‌. తెలుగు 'ప్రేమమ్‌'లో నాగచైతన్య సరసన నటించి ఇక్కడి యువతను కూడా బాగానే మెప్పించింది. మలయాళ సంగీత కార్యక్రమం మ్యూజిక్‌ మోజో ద్వారా మడోన్నా గాయనిగా కెరీర్‌ను ప్రారంభించింది. దీపక్‌దేవ్‌.. గోపీ సందర్‌ సంగీత దర్శకత్వంలో మడోన్నా పాడిన అనేక గీతాలు సంగీత ప్రియుల మదిలో నిలిచిపోయాయి. 
 
ఎంతో మంది సంగీత కళాకారుల్ని.. గాయకులను అందించిన కప్పా టీవీ కార్యక్రమాల ద్వారా కేరళ అంతటా మడోన్నా పాటలు మారుమోగాయి. గాయనిగానే కాకుండా నటిగా అనేక అవకాశాలు కల్పించాయి. సూర్య టీవీలో మడోన్నా చేస్తున్న ఓ కార్యక్రమం మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అప్పుడే మడోన్నా ప్రేమమ్ సినిమాకు ఎంపికైంది. ప్రస్తుతం అమ్మడు మలయాళం, తమిళం, తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. చిన్నతనం నుంచి సంగీతాన్ని జీవితంలో ఓ భాగం చేసుకున్న మడోన్నా.. నటిగా బిజీగా ఉన్నా.. పాటలు పాడటం మాత్రం ఆపలేదు. పాటలు పాడటం మాత్రం ఆపలేదు. 
 
తొలి ప్రాధాన్యత సంగీతానికే ఇస్తోంది. ఇటీవలే దుబాయ్‌ రేడియో స్టేషన్‌ కోసం దీపక్‌ దేవ్‌ స్వరపరిచిన జింగిల్స్‌ను మడోన్నా ఆలపించింది. అక్కడ కూడా మంచి గాయనిగా మరింత పేరు సంపాదించుకుంది. అదన్నమాట మడోన్నా సంగతి. ఎనీవే గాయనిగా, నటిగా మడోన్నా రాణించాలని మనమూ ఆశిద్దాం..
అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్లాక్‌బాక్స్ డీకోడ్ చేస్తేనే ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి : ఎస్ఎన్ రెడ్డి

పెను విషాదం ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ...

ఆ ఒక్కడు మినహా మిగిలిన వారంతా చనిపోయారు... ఎయిరిండియా

కులాంతర పెళ్లి చేసుకున్న యువతి.. 40 మందికి శిరోమండనం చేసిన గ్రామపెద్దలు!

విజయ్ రూపానీకి అదృష్ట సంఖ్యే దురదృష్టాన్నిస్తుంది.. జూన్ 12 (12-06)న ప్రాణం పోయింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments