Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్రెట్‌గా వివాహం చేసుకున్న మ‌ధుశాలినీ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (20:35 IST)
Madhushalini, Gokul Anand
హీరోయిన్ల పెండ్లిళ్లు వ‌రుస‌గా జ‌రిగిపోతున్నాయి. ఇటీవ‌లే న‌య‌న‌తార ప్రేమించిన‌వాడినే వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె బాట‌లో మ‌ధుశాలినీ చేరింది. ఇటీవ‌లే `9 అవ‌ర్స్‌` అనే వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్‌కు వ‌చ్చిన‌ప్పుడు పెండ్లి గురించి దాట‌వేసింది. తాజాగా ఈనెల 16న హైద‌రాబాద్ ప‌రిమిత స‌భ్యుల‌తో వివాహం చేసుకుని ఫొటోను పోస్ట్ చేసింది. మధు షాలిని & గోకుల్ ♥️ లవ్ అంటూ కాప్ష‌న్ కూడా పెట్టింది. `మేము అందుకున్న ప్రేమకు ధన్యవాదాలు. మేము మా జీవితంలోని కొత్త అధ్యాయం కోసం మా హృదయాలలో ఆశ, కృతజ్ఞతతో ఎదురుచూస్తున్నాము అంటూ పోస్ట్‌లో పేర్కొంది.
 
త‌మిళంలో బిజీగా వుండ‌డంతో తెలుగులో గేప్ తీసుకున్న‌ట్లు చెప్పింది. గోకుల్ ఆనంద్ కోలీవుడ్‌లో హీరోగా చేయ‌డంతోపాలు ప‌లు వెబ్ సిరీస్ చేశాడు. వీరిద్ద‌రు పంచాక్ష‌రం అనే సినిమాలో న‌టించారు. అప్ప‌టినుంచి వీరి ప్రేమ చిగురించి ఇప్ప‌టికి పెండ్లిదాకా వ‌చ్చింది. ఆమె పెట్టిన పోస్ట్‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.  మ‌ధుశాలినీ త్వ‌ర‌లో నిర్మాత‌గా కూడా మార‌బోతోంది.

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments