Webdunia - Bharat's app for daily news and videos

Install App

1994లో సల్మాన్ కంటే మాధురీనే పారితోషికం ఎక్కువ తీసుకునేదట!

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (15:13 IST)
1994లో హమ్ ఆప్కే హై కౌన్‌లో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించారు. సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో నటించడం కోసం సల్మాన్ కంటే మాధురీ దీక్షితే ఎక్కువ పారితోషితం పుచ్చుకుందని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించారు. బాలీవుడ్ లో ఈమధ్య తరచుగా హీరో హీరోయిన్‌ల పారితోషికంపై చర్చ జరుగుతోంది. ఎంత అగ్ర నాయికలైనా హీరోలకంటే తక్కువగానే ఇస్తున్నారు. 
 
తాజాగా వరుస విజయాలతో దూసుకుపోతున్న కంగనా రనౌత్ ఈ మధ్య భారీ పారితోషికం పెంచిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ట్విట్టర్‌లో అభిమానులు అనుపమ్‌ను ప్రశ్నించారు. ప్రధానంగా స్త్రీ, పురుష సమానత్వం అంశంపై అడిగారు. ఇందుకు ఆయన స్త్రీ, పురుష వివక్ష నిజమేనంటూ ఇంతవరకూ బయటికిరాని సల్మాన్, మాధురిల పారితోషికం రహస్యాన్ని బయటపెట్టారు.
 
1994లో సల్మాన్ కంటే మాధురీ దీక్షితే అధికంగా పారితోషికం తీసుకునేదని ఖేర్ తెలిపారు. ఆ సినిమా కోసం మాధురీ దీక్షిత్ మూడు కోట్ల మేర పుచ్చుకుందని.. ఈ మొత్తాన్ని ప్రస్తుతం అలియా భట్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మలు తీసుకుంటున్నారని చెప్పారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments