ఇండియన్ సినిమాపై బయోపిక్: సమర్పకుడిగా మారిన రాజమౌళి

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (14:36 IST)
భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా మారనున్నారు. ఇండియన్ సినిమాపై వస్తున్న బయోపిక్‌కు ఆయన సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ఇండియన్ సినిమా మూలం ఏమిటనే కథతో 'మేడ్ ఇన్ ఇండియా' సినిమా తెరకెక్కబోతోంది. 
 
భారత సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే గురించి ఇందులో చూపబోతున్నారు. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తాలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రాజమౌళి సమర్పణలో రానుంది. 
 
ఈ నేపథ్యంలో రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... కథ విన్న వెంటనే ఎంతో భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. అలాంటిది భారతీయ సినిమాపై బయోపిక్‌ను నిర్మించడమంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న వ్యవహారమన్నారు.
 
ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ చిత్ర యూనిట్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Live Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో కాంగ్రెస్

Sangareddy: అన్నం పాత్రలో కాలు పెట్టి హాయిగా నిద్రపోయిన వాచ్‌మెన్

బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు : ఆధిక్యంలో ఎన్డీయే కూటమి

Cold Wave: తెలంగాణలో చలిగాలులు.. శని, ఆదివారాల్లో పడిపోనున్న ఉష్ణోగ్రతలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments