Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ సినిమాపై బయోపిక్: సమర్పకుడిగా మారిన రాజమౌళి

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (14:36 IST)
భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా మారనున్నారు. ఇండియన్ సినిమాపై వస్తున్న బయోపిక్‌కు ఆయన సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ఇండియన్ సినిమా మూలం ఏమిటనే కథతో 'మేడ్ ఇన్ ఇండియా' సినిమా తెరకెక్కబోతోంది. 
 
భారత సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే గురించి ఇందులో చూపబోతున్నారు. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తాలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రాజమౌళి సమర్పణలో రానుంది. 
 
ఈ నేపథ్యంలో రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... కథ విన్న వెంటనే ఎంతో భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. అలాంటిది భారతీయ సినిమాపై బయోపిక్‌ను నిర్మించడమంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న వ్యవహారమన్నారు.
 
ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ చిత్ర యూనిట్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments