Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృభాష నేత్రాల వంటిది - పరభాష కళ్ళజోళ్లు వంటిది : చంద్రబోస్

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (12:53 IST)
మాతృభాష గొప్పతనాన్ని సినీ గేయరచయిత చంద్రబోస్ మరోమారు వివరించారు. మాతృభాష రెండు నేత్రాల వంటివనీ, పరభాష (ఆంగ్లం) కళ్లజోడు వంటిదని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల మాతృభాషను మరచిపోతే భవిష్యత్తే లేదన్నారు. 
 
కృష్ణాజిల్లా చల్లపల్లిలో స్వచ్ఛ చల్లపల్లి ఐదేళ్ల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబోస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసిక వికాసం మాతృభాషతోనే సాధ్యమన్నారు. పిల్లలకు తల్లి గర్భంలోనే గ్రామర్‌ వస్తుందనీ, మాతృభాషలో అంత గొప్ప లక్షణం ఉందన్నారు. 
 
మాతృభాషలో విద్యాబోధన జరిగితే ఆలోచనలు విస్తరిస్తాయన్నారు. మాతృభాష పునాదుల మీద ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని తెలిపారు. అమెరికాలో ఉంటున్న తెలుగువారంతా మాతృభాషలో విద్య అభ్యసించిన వారేనని చెప్పారు. గొప్పస్థాయిలో, స్థితిలో ఉన్నవారందరూ మాతృభాషలో చదువుకున్నవారేనని గుర్తుచేశారు. 
 
భాషతోనే సంస్కృతి అలవడుతుందన్నారు. పరభాష కళ్లజోడు లాంటిదని, మాతృభాష రెండు కళ్లు వంటివని అభివర్ణించారు. కళ్లు లేకుండా అద్దాలు పెట్టుకోవటం ఎందుకని అన్నాదురై అనేవారని చంద్రబోస్‌ గుర్తుచేశారు. అన్నిభాషా సంస్కృతుల గాలులు ధారాళంగా ఇంట్లోకి వీచేలా కిటికీలు తీయాలని, కానీ.. ఆ గాలి తాకిడికి కొట్టుకుపోకుండా జాగత్త్ర పడదామని విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పేర్కొన్నారని చంద్రబోస్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments