Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌లేశుని ఆశీస్సులు పొందాం - రాజీనామాలు నా ద‌గ్గ‌ర‌కు రాలేదుః మంచు విష్ణు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (18:30 IST)
Manchu family Tirumala
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత మంచు మోహ‌న్‌బాబు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి తిరుమ‌ల సంద‌ర్శించారు. మోహ‌న్‌బాబు, మంచు విష్ణు, ల‌క్ష్మీప్ర‌స‌న్న‌తోపాటు పేన‌ల్ స‌భ్యులైన బాబూమోహ‌న్‌, మాదాల‌ర‌వి, శ్రీ‌నివాసులు త‌దిత‌రులు వున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా మోహ‌న్‌బాబు మాట్లాడుతూ, `మా` అధ్యక్షునిగా మా బిడ్డ ఎన్నిక‌కావ‌డం ఆ వేంక‌టేశ్వ‌రుని, షిరిడి సాయి ఆశీస్సులు ద‌క్కాయి. వారి ఆశీస్సుల‌తోపాటు `మా` స‌భ్యులంద‌రినీ ఆశీర్వాదం వుంది. ఇది ఎంతో బాధ్య‌త‌తో కూడిన ప‌ద‌వి. గౌర‌వ‌ప్ర‌ద‌మైంది. గౌర‌వానికి ఏ లోటురాకుండా నా బిడ్డ నెర‌వేరుస్తాడు. అంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
మంచు విష్ణు తెలుపుతూ, ఈ గెలుగు ప్ర‌తి ఒక్క స‌భ్యుడిది. ఎన్నిక‌ల త‌ర్వాత రావాల‌ని మొక్కుకున్నా. అందుకే తిరుమ‌ల వ‌చ్చా. ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నాం. ఇంకా మాకు బ‌లం కావాలి. అంద‌రి ఆశీస్సులు కావాల‌ని తెలిపారు. 
ఈ సంద‌ర్భంగా అక్క‌డి విలేక‌రులు పోటీ పేన‌ల్ రాజీనామా చేశారు క‌దా? అని అడిగితే, మీ మీడియా ద్వారానే నాకు తెలిసింది. నా ద‌గ్గ‌ర‌కు రాజీనామాలు రాలేదు. వ‌చ్చాక చెబుతాను. ఇది దేవుడి స‌న్నిది కాబ‌ట్టి. అంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు అంటూ ముగించారు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments