Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమీ తెలీందానిలా నటించడం అతి కష్టం.. లావణ్య త్రిపాఠీ

కాలేజీ గర్ల్, గ్లామర్ డాల్, పల్లెటూరు యువతి, ఆధునిక మహిళ, ఉద్యోగిని వంటి ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన పాత్రలను చేయడం పెద్ద కష్టం కాకపోపచ్చు కానీ అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలీనిదానిలా నటించడం చాలా కష్టం అంటున్నారు లావణ్య త్రిపాఠి. శ్రీనువైట్ల దర్శకత్వం

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (04:09 IST)
కాలేజీ గర్ల్, గ్లామర్ డాల్, పల్లెటూరు యువతి, ఆధునిక మహిళ, ఉద్యోగిని వంటి ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన పాత్రలను చేయడం పెద్ద కష్టం కాకపోపచ్చు కానీ అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలీనిదానిలా నటించడం చాలా కష్టం అంటున్నారు లావణ్య త్రిపాఠి. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలో మొబైల్స్, కంప్యూటర్లు వంటి మోడ్రన్ డివైస్‌ల గురించి నిజ జీవితంలో బాగా తెలిసి ఉండి కూడా వాటి గురించి ఏమీ తెలీని అమ్మాయిలా నటించిన లావణ్య సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి పేరు కొట్టేశారు.
 
‘‘మిస్టర్ సినిమా కోసం దర్శకుడు శ్రీను వైట్లగారు కథ చెబుతునప్పుడు... ఈ రోజుల్లో మొబైల్స్, కంప్యూటర్స్‌ గురించి ఏం తెలియని అమ్మాయి ఎలా ఉంటుందోనని ఆలోచించా. ఆ ఆలోచనే చంద్రముఖి పాత్ర అంగీకరించడానికి కారణమైంది. ఏమీ తెలియని అమ్మాయిలా నటించడమంటే సవాలే. ఆ సవాల్‌ను నేను స్వీకరించా’’ అన్నారు లావాణ్యా త్రిపాఠి. వరుణ్‌తేజ్‌ హీరోగా నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు నిర్మించిన సినిమా ‘మిస్టర్‌’లో లావణ్య ఓ హీరోయిన్‌గా, హెబ్బా పటేల్‌ మరో హీరోయిన్‌గా నటించారు. మిస్టర్ సినిమా గత శుక్రవారం విడుదల కావడం తెలిసిందే.
 
మనసుపెట్టి, కష్టపడి చేసిన మిస్టర్ సినిమా బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటుంటే సంతోషంగా ఉందని లావణ్య చెప్పారు. ఇప్పటి వరకూ నేను చేయనటువంటి పాత్రను ‘మిస్టర్‌’లో చేశా. సినిమాలో ఎక్కువగా హాఫ్‌ శారీస్‌లో కనిపిస్తా. ఇందులో రాజ వంశానికి చెందిన అమ్మాయిని కాబట్టి... దుస్తులు, నగలు అందుకు తగ్గ సై్టల్‌లో డిజైన్‌ చేయించాం. నా దృష్టిలో గ్లామర్‌ అంటే ఎక్స్‌పోజింగ్‌ కాదు. పాత్రకు తగ్గట్టు నటించాలి అన్నారామె.
 
సోగ్గాడే చిన్ననాయనా చిత్రంలో నాగార్జున సరసన నటించి ప్రేక్షకుల మతులు పొగొట్టిన లావణ్యా త్రిపాఠీ శర్వానంద్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం నాగచైతన్య సరసన నటిస్తున్నారు. తమిళంలో మాయవన్ అనే సినిమాలో మనస్తత్వ శాస్త్రజ్ఞురాలిగా నటించారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments