Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడా?

సెల్వి
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (17:58 IST)
Masthan Ali
Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసుకు సంబంధించి అరెస్టయిన మస్తాన్ సాయి రిమాండ్ నివేదికలో కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మస్తాన్ సాయి లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడని ఆరోపణలు వున్నాయి. యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బ్లాక్‌మెయిల్‌కు ఉపయోగించుకున్నాడని కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. 
 
అధికారులు అతనిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద అభియోగాలు మోపారు. మస్తాన్ సాయి, అతని స్నేహితుడు ఖాజా ఇద్దరూ మాదకద్రవ్యాల సేవనానికి పాజిటివ్ పరీక్షించారని నివేదిక పేర్కొంది. మస్తాన్ సాయి మాదకద్రవ్యాల ప్రభావంతో లావణ్య నివాసానికి వెళ్లి అల్లకల్లోలం సృష్టించాడని పోలీసులు తెలిపారు. గత నెల 30వ తేదీన ఆమెను చంపడానికి ప్రయత్నించాడని ఆరోపించారు.
 
 
 
అదనంగా, నటుడు రాజ్ తరుణ్ గతంలో మస్తాన్ సాయి ల్యాప్‌టాప్ నుండి లావణ్య వీడియోలను తొలగించాడని నివేదిక వెల్లడించింది. అయితే, అంతకుముందే, మస్తాన్ సాయి ఆ వీడియోలను ఇతర పరికరాల్లోకి కాపీ చేశాడు. లావణ్యను చంపడానికి అతను అనేకసార్లు ప్రయత్నించాడని, హార్డ్ డిస్క్‌ను తిరిగి పొందడానికి ఆమెను హత్య చేయడానికి ఒక పథకం వేసాడని ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments