Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సర్జా భార్యకు, కుమారుడి కరోనా.. ఆందోళన వద్దని..?

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (18:19 IST)
కన్నడ హీరో చిరంజీవి సార్జా 35ఏళ్ల ప్రాయంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేఘనారాజ్ ఇటీవలే ఓ బాబుకు జన్మనిచ్చింది. కన్నడ నటి మేఘనారాజ్, ఆమె కుమారుడు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. 
 
చిరంజీవి సర్జా అభిమానులు, తన ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందవద్దని మేఘనారాజ్ కోరింది. తాను, తన కొడుకుతో పాటు నాన్న సుందర్‌రాజ్‌, అమ్మ ప్రమీలా జోషాయ్‌కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా మా కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. తామంతా క్షేమంగా ఉన్నాం. 
 
ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాం. జూనియర్ చిరంజీవి సురక్షితంగా ఉన్నాడు. మా కుటుంబమంతా కరోనాపై పోరాడి... జయిస్తామని మేఘనారాజ్‌ ధీమా వ్యక్తం చేసింది. మేఘనారాజ్ తల్లిదండ్రులు సుందర్ రాజ్‌-ప్రమీలా జోషాయ్‌కు కన్నడనాట మంచి పాపులారిటీ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments