Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత పిటిషన్‌పై కూకట్ పల్లి కోర్టు షాక్.. ఫోటోలు పెట్టేది వాళ్లే.. మరి పరువు..?

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (19:57 IST)
యూట్యూబ్ ఛానల్ ఛానళ్ల పై టాలీవుడ్ హీరోయిన్ సమంత వేసిన పిటిషన్‌పై కూకట్ పల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమంత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా వేసింది కూకట్ పల్లి కోర్టు. ఇవాల్టి కోర్టు సమయం ముగియడంతో తీర్పును రేపు వెల్లడిస్తామని కూకట్‌పల్లి కోర్టు స్పష్టం చేసింది. ఇక అంతగా.. సమంత తరపు న్యాయవాది వాదన విన్న కోర్టు… ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
తప్పు జరిగిందని భావిస్తే….పరువునష్టం దాఖలు చేసే బదులు , వారి నుండి క్షమాపణలు కోరొచ్చు కదా ఆని ప్రశ్నించింది కోర్టు. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టేది వారే… పరువుకు భంగం కలిగింది అనేది వారే కదా అని తెలిపింది. కోర్టు ముందు సెలబ్రిటీలు, మామూలు ప్రజలు అందరూ సమానమేనని కూడా… సమంత తరపు న్యాయవాదిపై ఫైర్ అయింది కోర్టు.
 
సమంత విడాకులు ఇంకా తీసుకోలేదు. ఆ లోగా ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని సమంత తరఫు న్యాయవాది బాలాజీ వడేరా పేర్కొన్నారు. సమంత ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాశారు. ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని కోర్టుకు విన్నవించారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజన్క్షన్ ఇవ్వాలని కోర్ట్ ను కోరారు సమంత తరఫు న్యాయవాది. 

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments