Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమ్లా నాయక్ గురించి వివ‌రాలు తెలుసుకున్న కె.టి.ఆర్

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (16:05 IST)
KTR, Trivikram Srinivas, Radhakrishna
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం  
'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
 
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ నెల 21 న 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా నిర్వహించటానికి చిత్ర బృందం సంకల్పించింది. హైదరాబాద్, యూసుఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభ మవుతుంది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కె.టి.ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న్ను ఆహ్వానించేందుకు శ‌నివారంనాడు కె.టి.ఆర్‌.ను త్రివిక్ర‌మ్‌, నిర్మాత రాధాకృష్ణ వెళ్ళారు. ఆయ‌న సాద‌రంగా ఆహ్వానించి ఏర్పాట్ల గురించి సినిమా గురించి వివ‌రాలు తెలుసుకున్నారు.
 
అలాగే రాష్ట్ర   సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ప్రేక్షకాభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో చిత్ర బృందం అంతా పాల్గొననుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments