అక్కినేని నాగార్జున ఈమధ్య కొత్తకొత్త తరహాల కథలు, దర్శకుల్ని పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. మనం తర్వాత కొత్తవారితో కథలు వినేందుకు రెడీ అయినట్లే.. పాతవారు కూడా కథ చెబితే వింటున్నాడు. తాజాగా ఓ లైట్బాయ్ చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దర్శకుడు అవ్వాలని ఇండస్ట్రీలో వచ్చి లైట్బాయ్గా కొద్దిరోజులు పనిచేసి.. తర్వాత అసిస్టెంట్ దర్శకుడిగా ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. ఆయనే కృష్ణవంశీ.
నిన్నేపెళ్ళాడుతా చిత్రం నాగ్, కృష్ణవంశీ కాంబినేషన్లో పేద్ద హిట్. అయితే ఆ దర్శకుడికి సరైన హిట్లు లేకపోయినా... నాగార్జునకు ఇటీవలే వంశీ చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ స్నిగల్ ఇచ్చినట్లు తాజా సమాచారం.. త్వరలో దానికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.