Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దంపతుల మధ్య ఏం జరిగిందో మనకెందుకు? ఖుష్బూ

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (22:10 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరో నాగ చైతన్య, ఆయన భార్య, హీరోయిన్ సమంతలు తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి, చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నామని వారిద్దరూ వేర్వేరుగా సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు. అయితే వీరిద్దరి విడాకుల వ్యవహారాన్ని అభిమానులే కాదు నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
ఇదిలావుంటే సమంత తమ విడాకుల ప్రకటన తర్వాత తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. 'ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు నన్ను నేను మార్చుకోవాలి. నా పడకగదిని నేను సిద్థం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నాం వరకూ నిద్రపోకూడదు. ఇక, పగటి కలలు కనడం మాని చేయాల్సిన పనుల పైనే దృష్టి పెట్టాలి' అని ఇన్‌స్టా స్టోరీలో సమంత రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ విడాకులపై సీనియర్‌ నటి ఖుష్బూ స్పందించారు. 'భార్యభర్తల మధ్య ఏం జరిగింది అనేది, ఎందుకు విడిపోయారనేది వారిద్దరికీ తప్ప ఎవరికీ తెలీదు. వాళ్ల ప్రైవసీని అందరూ గౌరవించాలి. ఆ బాధ నుంచి వారు బయటకు రావడానికి కాస్త సమయం పడుతుంది. దయ చేసి ఈ విషయంపై రూమర్లు క్రియేట్‌ చేయవద్దు' అంటూ ఖుష్బూ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments