Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ షో స్టార్ట్.... 'ఖైదీ నెంబర్‌ 150' ప్రత్యేక ప్రదర్శన ప్రారంభం.. టాకేంటి?

తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ షో స్టార్ట్ అయింది. ఆయన నటించిన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్ర ప్రత్యేక ప్రదర్శన బుధవారం వేకువజామునుంచి ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. హైదరాబాద్‌లోని ఐమ

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (05:22 IST)
తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ షో స్టార్ట్ అయింది. ఆయన నటించిన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్ర ప్రత్యేక ప్రదర్శన బుధవారం వేకువజామునుంచి ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శన ఆరంభమైంది. 
 
వెండితెరపై తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. తన ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150' పలుచోట్ల ప్రత్యేక ప్రదర్శన అభిమానుల కోలాహలం మధ్య ప్రారంభమైంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం, పాలకొల్లు పట్టణాలతోపాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శన ప్రారంభం కావడంతో ఆయా థియేటర్ల వద్ద చిరంజీవి అభిమానుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. 
 
బాణాసంచా కాలుస్తూ, భారీ కటౌట్లు కడుతూ కేరింతలు కొడుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నందున ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఏలూరులో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శన తిలకించేందుకు స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి హాజరయ్యారు. అయితే, ఈ చిత్రం టాక్ తెలియాలంటే మరో మూడు గంటలు వేచి ఉండాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడిలో పాక్ సైనికుడు... తేల్చిన నిఘా వర్గాలు

కాశ్మీర్‌లో యాక్టివ్ స్లీపర్ సెల్స్ : 48 గంటలు పర్యాటక ప్రాంతాలు మూసివేత

ఈ రోజు అర్థరాత్రి లోపు పాక్ పౌరులు దేశం విడిచి పోవాల్సిందే.. లేకుంటే మూడేళ్లు జైలు!!

Chicken: చికెన్‌ను కట్ చేయమన్న టీచర్.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments