Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ' కలెక్షన్లు చూసి బెంబేలెత్తిపోతున్న రాజమౌళి... కొత్త టార్గెట్స్‌ను అధిగమించేదెలా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్.150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ మొదటి రోజు కలక్షన్స్ స

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (10:11 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్.150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ మొదటి రోజు కలక్షన్స్ సునామీ ముగిసిన తర్వాత 12వ తేదీన విడుదలైన 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ జోరు తగ్గుతుందని అందరూ భావించారు. అయితే, 'శాతకర్ణి'తో పాటు 'శతమానం భవతి' విడుదల అయిన తర్వాత కూడా ఈ మూవీ కలెక్షన్స్ జోరు తగ్గక పోవడం ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. మొదటివారం ముగిసే సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.76 కోట్లు వసూలు చేయగా, టాలీవుడ్‌లో రూ.100 కోట్లను క్రాస్‌ చేసిందని పేర్కొన్నారు.
 
అదేసమయంలో బుధవారంతో 'ఖైదీ నెంబర్.150' విడుదలై వారంరోజులు పూర్తయింది. నేటి నుంచి ఈ సినిమాకు రెండో వారం రన్ ప్రారంభమైంది. టాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సినిమాకు అసలు పరీక్ష ఈరోజు నుంచే మొదలవుతుంది. చిరంజీవి రీఎంట్రీ అదిరిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ చిత్రం కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేక పోయారు.
 
దీంతో దర్శకధీరుడు రాజమౌళికి భయం పట్టుకుంది. 'బాహుబలి' కలెక్షన్లను 'ఖైదీ' క్రాస్ చేసే అవకాశం లేనప్పటికీ కొన్ని ఏరియాలలో మాత్రం 'ఖైదీ' 'బాహుబలి'ని క్రాస్ చేయడం ఖాయం అని అంటున్నారు. దీంతో 'బాహుబలి-2'కు కొత్త టార్గెట్స్‌ను సృష్టించాల్సి ఉంటుంది. ఈ చిత్రం తన అకౌంట్ క్లోజ్ చేసే సమయానికి ఇంకా చాలా ఏరియాల్లో 'బాహుబలి' రికార్డులను క్రాస్ చేయడం ఖాయమన్నారు. దీంతో రాజమౌళి తన 'బాహుబలి 2'కు కొత్త టార్గెట్లు ఏర్పరుచుకోవలసిన అవసరం ఏర్పడింది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. 
 
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.76 కోట్లు, కర్ణాటకలో రూ.9 కోట్లు, నార్త్‌ ఇండియా రూ.1.3 కోట్లు, నార్త్‌ అమెరికా రూ.17 కోట్లు మిగిలిన ప్రాంతాల్లో రూ.3.99 కోట్లు, ఒరిస్సాలో రూ.40 లక్షలు, తమిళనాడులో రూ.60 లక్షలు చొప్పున మొత్తం మొత్తం 108.48 కోట్లు వసూలు చేసింది. ఇంకా భారీ వసూళ్ళను రాబట్టునుందనీ. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments