Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కేసరి'గా రానున్న పక్షి రాజు

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (20:22 IST)
బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ ప్రస్తుతం 'కేసరి' అనే ఒక హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. అనురాగ్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, అజుర్ ఎంటర్‌టైన్‌మెంట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1891లో జరిగిన సారాగడి యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 
 
గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్‌కు భారీ ఆదరణ వచ్చింది. 'నేను తన బానిసను అని, భారతీయులంతా మూర్ఖులని ఒక బ్రిటిష్ వ్యక్తి నాతో అన్నాడు. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది' అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. 'నేను ధరించిన తలపాగా కేసరి (కాషాయ రంగు), కారే నా రక్తం కేసరి' అనే డైలాగ్ చెప్తూ అక్షయ్ కుమార్ ఆకట్టుకున్నాడు.
 
ఈ సినిమాలో పరిణీతి చోప్రా కథానాయిక. సారాగడి ప్రాంతంలో కేవలం 21 మంది సిక్కులకు పదివేల మంది ఆఫ్ఘానీయులతో యుద్ధం జరుగుతుంది. అసలు ఆ యుద్ధం ఎందుకు సంభవించింది, ఆ తర్వాత ఏమి జరిగిందనేదే ఈ చిత్రం కథ. ఈ ట్రైలర్‌లో చూపిన పోరాట సన్నివేసాలు చాలా బాగున్నాయని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments