Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి 20లో ఎవ‌రు న‌టిస్తున్నారో తెలుసా..?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (13:12 IST)
నేను శైల‌జ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్స‌స్ సాధించిన‌ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ త‌ర్వాత నేను లోక‌ల్, అజ్ఞాత‌వాసి, మ‌హాన‌టి చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌క హృద‌యాల‌ను దోచుకుంది.
 
 మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర‌లో అద్భుతంగా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌సంశ‌లు అందుకుంది. మహానటి తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ .. తమిళంలో ఆమె వరుస సినిమాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగులో ఒక కథ నచ్చడంతో చేయడానికి వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేష్‌ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నరేంద్రనాథ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. క‌థానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. 
 
రాజేంద్ర‌ప్ర‌సాద్, సీనియర్ నరేష్, నదియా, కమల్ కామరాజు భానుశ్రీ మెహ్రాలను ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం తీసుకున్నారు. దీనికి సంబంధించిన స్పెష‌ల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసారు. మరి కొంతమంది నటీనటుల పేర్లను త్వరలోనే తెలియజేయనున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments