Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ బయోపిక్: జగన్ సతీమణి భారతి పాత్రలో కీర్తి సురేష్?

టాలీవుడ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ బయోపిక్ రాబోతుంది. ఇందులో టాప్ హీరోయిన్ నయనతార వైఎస్సార్ సతీమణిగా, కేరళ స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో కనిపించనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (11:02 IST)
టాలీవుడ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ బయోపిక్ రాబోతుంది. ఇందులో టాప్ హీరోయిన్ నయనతార వైఎస్సార్ సతీమణిగా, కేరళ స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో కనిపించనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ బయోపిక్‌‌లో జగన్ భార్య పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు టాక్ వస్తోంది.

ఆనందో బ్రహ్మ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న మహి వి. రాఘవ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో సూర్య చేయనున్నట్లు సమాచారం. 
 
ఇక జగన్ భార్య భారతి పాత్రలో కీర్తి సురేష్ నటించే అవకాశం ఉన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమా రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని.. విజయ్ చిల్లా.. దేవిరెడ్డి శశి ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఇకపోతే.. ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ పాదయాత్ర నుంచి.. సీఎం పదవి చేపట్టేవరకు ఈ కథ కొనసాగుతుందని సినీ జనం అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments