Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రినా కైఫ్‌ దంపతులను చంపుతామంటు బెదిరింపులు...

Webdunia
సోమవారం, 25 జులై 2022 (14:50 IST)
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ దంపతులను చంపుతామంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కత్రినా భర్త విక్కీ కౌశల్ ముంబై శాంతాక్రజ్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసులకు విక్కీ రాసిచ్చిన ఫిర్యాదులో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇన్‌స్టా ఖాతా ద్వారా తమను బెదిరిస్తూ, బెదిరింపు ఇమేజ్‌లను పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు వ్యక్తి కత్రికా కైఫ్‌ను వెంబడిస్తున్నట్టు విక్కీ పేర్కొన్నారు. 
 
విక్కీ కౌశల్ ఇచ్చి ఫిర్యాదు మేరకు ముంబై శాంత్రాక్రజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు గత యేడాది డిసెంబరు 9వ తేదీన మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెల్సిందే. ఈ జంట ఇటీవల మల్దీవుల విహారయాత్రకు వెళ్లి స్వదేశానికి వచ్చింది. 

సంబంధిత వార్తలు

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments