Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ కోసం చెన్నై వెళుతూ రోడ్డు ప్రమాదం... టీవీ నటి దుర్మరణం...

కర్నాటక రాష్ట్రానికి చెందిన టీవీ నటి దుర్మరణం చెందింది. షూటింగ్ కోసం చెన్నైకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని సున్నంపకొట్టయ్‌

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (13:46 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన టీవీ నటి దుర్మరణం చెందింది. షూటింగ్ కోసం చెన్నైకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని సున్నంపకొట్టయ్‌ గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే కన్నడ బుల్లితెర నటిగా రేఖా సింధు మంచి పేరు తెచ్చుకుంది. ఈమెతో పాటు మరో నలుగురు కలిసి కారులో బెంగుళూరు నుంచి చెన్నైకు వెళుతున్నారు. ఈ కారు చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలైంది. 
 
ప్రమాదంలో చనిపోయిన మిగతా ముగ్గురిని అభిషేక్‌ కుమారన్‌ (22), జయకంద్రన్ ‌(23), రక్షణ్ ‌(20)గా గుర్తించారు. మృతదేహాలను తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
డివైడర్‌ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని వేలూరు ఎస్పీ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఆరుగురు ఉన్నారని వెల్లడించారు. గాయపడిన వారిలో ఇద్దరినీ వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments