నన్ను అందుకే టార్గెట్ చేశారు... కంగనా రనౌత్ (video)

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (08:15 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మరోమారు మాటల తూటాలు ఎక్కుపెట్టారు. బాలీవుడ్‌లోని సినీ మాఫియా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, డ్రగ్స్ వ్యవహారాన్ని తాను లేవనెత్తినట్టు గుర్తు చేశారు. అయితే, అదే డ్రగ్ మాఫియా కారణంగా ఆదిత్య ఠాక్రేకు ముప్పు వస్తుందనే తనను శివసేన టార్గెట్ చేసిందని ఆమె ఆరోపించారు. 
 
బీఎంసీ అధికారులు ఇటీవ‌లే నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా నిర్మించారని ఆరోపిస్తూ కంగ‌నా కార్యాల‌యాన్ని కూల్చేసిన విష‌యం తెలిసిందే. అయితే హైకోర్టును ఆశ్ర‌యించ‌గా కూల్చివేత‌పై.. కోర్టు స్టే విధించింది. మ‌రోవైపు ఈ విష‌యంలో త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ మ‌హారాష్ట్ర సీఎం కొష్యారిని క‌లిసి కంగనా విజ్ఞప్తి చేసింది. 
 
అంతకుందు... త‌న ఆఫీసు కూల్చివేత నేప‌థ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేపై విమ‌ర్శ‌లు గుప్పించింది. త‌న మాట‌ల‌తో శివసేన నేతలకు ముచ్చెమటలు పట్టించారు. ఇపుడు ఏకంగా సీఎం ఉద్ధ‌వ్ థాక్రే కుమారుడు ఆదిత్య‌థాక్రేను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ వ్య‌వ‌హారంతో సీఎం కుమారుడు ఆదిత్యాథాక్రేకు త‌లనొప్పులు వ‌స్తాయ‌ని, అందుకే త‌న‌ను టార్గెట్ చేశార‌ని కంగ‌నా ఆరోపించింది. ఎవ‌రు ఎవ‌రి ప‌ని ప‌డ‌తారో చూడాల‌ని కంగనా చుర‌క‌లంటించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments