Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు బంగ్లాదేశ్ షాక్ : ఎమర్జెన్సీ మూవీపై నిషేధం!

ఠాగూర్
బుధవారం, 15 జనవరి 2025 (13:54 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు బంగ్లాదేశ్ పాలకులు షాకివ్వనున్నారు. ఆమె ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ నెల 17వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రాన్ని ఒక్క భారత్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ చిత్రం విడుదల కాకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించాలన్న తలంపులో ఉంది. 
 
ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో కంగనా రనౌత్ నిర్మించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందిరాగాంధీ పాత్రను కంగన పోషించగా, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో శ్రేయస్ తల్పాడే కనిపించనున్నారు.
 
మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలనే యోచనలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత... భారత్ - బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఎమర్జెన్సీ' మూవీని బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

Rayalaseema Express: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Telangana: లండన్‌లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి

రూ.476 కోట్ల విలువైన విమానం నీటిపాలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments