Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ బాట‌లో క‌మ‌ల్ అడుగులు

Webdunia
మంగళవారం, 11 మే 2021 (15:23 IST)
Kamal-pvan
ప‌వ‌న్ క‌ళ్యాన్‌కూ క‌మ‌ల్ హాస‌న్‌కూ ఓ విష‌యంలో పోలిక‌వుంది. త‌ను రాజ‌కీయ‌పార్టీ పెట్టాల‌నుకున్న స‌మ‌యంలో 2018లోనే చెన్నై వ‌చ్చిన ప‌వ‌న్‌తో క‌మ‌ల్ భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ప‌రిణామాల‌వ‌ల్ల ఇరువురూ రాజ‌కీయ పార్టీలు పెట్టారు. ఇద్ద‌రూ రాజ‌కీయ పార్టీ పెట్టి ఓడిపోయిన వారే. 2019లో జ‌రిగిన ఫ‌లితాల కార‌ణంగా ఆంధ్ర రాజ‌కీయాల వ‌ల్ల అల‌సిపోయిన వ‌ప‌న్ మ‌ర‌లా సినిమాల‌వైపు దృష్టి పెట్టాడు. అదేమంటే. పార్టీని న‌డిపించాలంటే డ‌బ్బులు కావాలి క‌దా అన్నాడు. ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ ప‌రిస్థితి అలానే వుంది. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో నిల‌బ‌డి భంగ‌ప‌డ్డాడు. అందుకే ఇప్ప‌టికైనా సినిమాల‌వైపు దృష్టిపెట్టాడు. అందులోనూ రెండు సినిమాలు సగంపైగా పూర్త‌య్యాయి. వాటిని కంప్లీట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నాడు.
 
భార‌తీయుడు సినిమా 30 ఏళ్ళ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో క‌మ‌ల్ హాస‌న్ చ‌ర్చ‌లు జ‌రిపాడ‌ని టాక్ నెల‌కొంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇండియ‌న్‌^2 త‌మిళంలో, భార‌తీయుడు2 తెలుగులో చేస్తున్నారు. లైకా సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను చేసింది. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల‌వ‌ల్ల ఆ సినిమా ముప్పావు వంతు పూర్త‌య్యాక అట‌కెక్కింది. అందుకే లైకా సంస్థ ఈ విష‌యాన్ని క‌మ‌ల్‌తో ప్ర‌స్తావించినట్లు తెలిసింది. ఇందుకు శంక‌ర్‌ను ఒప్పించే బాధ్య‌త‌ను క‌మ‌ల్ తీసుకున్నాడ‌ని సినీవ‌ర్గాలు తెలుపుతున్నాయి.
 
లంచ‌కొండిత‌నం, అవినీతి పై భార‌తీయుడు ఏ విధంగా పోరాడాడు అన్న‌ది మొద‌టి భాగ‌మైతే రెండో భాగంలో ఇప్ప‌టి టెక్నాల‌జీని కూడా అందులో చూపిస్తూ స‌రికొత్త క‌థ‌గా మ‌లిచార‌ని తెలిసింది. అదేకాకుండా `శ‌భాష్ నాయుడు` అనే సినిమాను కూడా పూర్తి చేసే ప్లాన్‌లో వున్నాడ‌ని స‌మాచారం. ఇవికాకుండా మ‌రో రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఈ రెండు సినిమాల‌కు త‌న టీమ్ లోని కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్నార‌ట‌. మ‌రి 2022లో క‌మ‌ల్ జోష్ ఏ రేంజ్‌లో వుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments