Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్ : వాళ్ళ నాన్నగారిలా బాబాయ్... మా నాన్నగారిలా నేను...

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (11:12 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులోభాగంగా, ఈ చిత్రంలోని పలు పాత్రల కోసం పలువురు యువ హీరో హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు.
 
ముఖ్యంగా, ఆ పాతతరం హీరోలు, హీరోయిన్ల పాత్రల్లో యువతరం కథానాయకులు, కథానాయికలు నటిస్తున్నారు. ఈక్రమంలో తాజా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త లుక్ ఒకటి విడుదలైంది. బయోపిక్‌లో నందమూరి కల్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. హరికృష్ణ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కల్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
 
'30 ఏళ్ల క్రితం మా బాబాయ్‌తో బాలగోపాలుడు సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పడు.. బాబాయ్, వాళ్ల నాన్నగారిలా.., నేను మా నాన్న గారిలా" అని క్యాప్షన్ పెట్టాడు కల్యాణ్ రామ్. తాజాగా బయటకు వచ్చిన పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుంది. ఎన్టీఆర్ రాజకీయ యాత్రలో హరికృష్ణ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
 
రెండు భాగాలుగా తెరకెక్కే ఈ బయోపిక్‌ తొలి భాగం వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల కానుంది. మొదటి విభాగానికి 'కథానాయకుడు' అని, రెండో విభాగానికి 'మహానాయకుడు' అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తుంది. 
 
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రని రానా పోషిస్తుండ‌గా, ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి, ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వ‌రిగా హిమాన్సీ నటిస్తున్నారు. 
 
ఎస్వీఆర్ పాత్రలో మెగా బ్రదర్ నాగబాబు కనిపించనున్నారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో నందమూరి బాలకృష్ణ న‌టిస్తుండ‌గా, దివ‌గంత న‌టి శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ క‌నిపించ‌నుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments