Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘జీ 5’లో జ్యోతిక, కార్తీ నటించిన ‘దొంగ’ వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (14:00 IST)
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్‌ సినిమాను ‘జీ 5’ ఒటీటీ తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది. లాక్‌డౌన్‌లో డైరెక్ట్‌–టు–డిజిటల్‌ ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్‌ సినిమాలు ‘అమృతరామమ్‌’, ‘47 డేస్‌’, ‘బెలూన్‌’, ఇటీవల ఒరిజినల్‌ మూవీ ‘మేక సూరి’ సహా కామెడీ సిరీస్‌ ‘అమృతం ద్వితీయం’, పలు ఒరిజినల్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’, ‘లూజర్’ వంటివి ‘జీ 5’లో విడుదలయ్యాయి. ఇప్పుడీ ఓటీటీలో మరో సినిమా విడుదల కానుంది.
 
జ్యోతిక, కార్తీ కలిసి నటించిన తొలి చిత్రం ‘దొంగ’. నిజ జీవితంలో వదిన, మరిది అయిన వీళ్లిద్దరూ ఈ చిత్రంలో అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. ఆగస్టు 14న ఈ సినిమా ‘జీ 5’లో విడుదల కానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘దొంగ’ వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌కి ‘జీ 5’ సిద్ధమైంది.
 
‘దృశ్యం’ మాతృక, మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసేఫ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సత్యరాజ్‌ తండ్రి పాత్ర పోషించిన ఈ చిత్రంలో కార్తీ సరసన ‘మేడ మీద అబ్బాయి’, ‘గాయత్రి’ ఫేమ్‌ నిఖిలా విమల్‌ నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments