Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్‌లో మోహన్ లాల్... సెట్‌లో సందడి చేసిన అభయ్ రామ్!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (11:04 IST)
జూనియర్ ఎన్‌టిఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ''జనతా గ్యారేజ్''. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరిగుతోంది. ఈ షూటింగ్‌లో ఒక యంగ్ హీరో కూడా పాల్గొన్నాడు. అతనెవరో కాదు అభయ్ రామ్. జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ జనతా గ్యారేజ్ సెట్‌లో సందడి చేస్తున్నాడు. హైదరాబాద్‌లోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతుండడంతో ఎన్‌టిఆర్ భార్య ప్రణతి, తనయుడు అభయ్ రామ్ షూటింగ్ లొకేషన్‌కు వెళ్ళారట. వీరిద్దరి రాకతో లొకేషన్ అంతా ఖుషి ఖుషిగా మారింది. 
 
యంగ్ టైగర్ అయితే తనయుడితో సెట్‌లో చాలా సరదాగా ఆడుకున్నాడు. కుందనపు బొమ్మ సమంత మాత్రం అభయ్‌ని ఎత్తుకొని హంగామా చేసింది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ సెట్‌లో అభయ్ చేసిన సందడికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషియల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టు 12న రిలీజ్ చేయడానికి యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెన్నైలో పవన్ ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే.. ఆయన చెప్పింది వింటాం..

ఇజ్రాయెల్ - ఇరాన్‌లు కాల్పుల విరమణ - దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

Dogs diving at the Olympics: స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్న శునకాలు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments