Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ హీరోయిన్‌ను లైన్లో పెట్టిన జూనియర్ ఎన్టీఆర్!

Webdunia
బుధవారం, 12 మే 2021 (20:14 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రంలో మహేష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఇపుడు ఈ భామకు మరో టాలీవుడ్ స్టార్‌తో నటించే లక్కీ ఛాన్స్ వరించింది. 
 
హీరో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుంది. ప్రస్తుతం కొరటాల శివ చేస్తున్న 'ఆచార్య' .. చిత్రీకరణ పరంగా చివరిదశలో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన పనులు పూర్తయిన తర్వాతనే ఆయన ఎన్టీఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. 
 
ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ పాత్ర చాలా పవర్ఫుల్‌గా ఉంటుందనీ, ఇంతవరకూ ఎన్టీఆర్ ఈ తరహా పాత్రను చేయలేదని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా ఛాన్స్ ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.
 
కొరటాల ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో ఉండటం వలన, ఈ సినిమా కోసం కియారా అద్వానిని గానీ .. రష్మికనుగాని కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. 
 
అయితే, 'భరత్ అనే నేను'తో కియారాకు కొరటాల పెద్ద హిట్ ఇచ్చాడు. అందువలన ఆయన సంప్రదిస్తే ఆమె కాదనకపోవచ్చనే టాక్ వినిపించింది. అందుకే ఈ సినిమాలో కథానాయికగా ఆమెకి ఛాన్స్ లభించే అవకాశాలే ఎక్కువన్న టాక్ ఫిల్మ్ సిటీలో వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా తప్పించుకుందంటే?

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments