Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఘటనపై Jr. ఎన్టీఆర్!.. ఇక ఆ సంస్కృతిని ఆపేద్దాం..

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (16:15 IST)
అసెంబ్లీలో నారా భువనేశ్వరిని అవమానించారని.. ప్రెస్ మీట్‌లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. ఈ ఘటనపై బాబుకు పలువురు సంఘీభావం చెప్తున్నారు. అంతేగాకుండా నందమూరి ఫ్యామిలీ ఆయనకు వెన్నంటి వుండి.. ఈ చర్యకు తీవ్రంగా ఖండించింది.

తాజాగా అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి అని గుర్తు చేశారు. మన నవనాడుల్లో, మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సాంప్రదాయం అది అని చెప్పారు. 
 
మన సాంప్రదాయాలను జాగ్రత్తగా, భద్రంగా రాబోయే తరాలకు అప్పజెప్పాలే కానీ... మన సంస్కృతిని కాల్చివేస్తూ రాబోతే తరానికి బంగారు బాట వేస్తున్నామంటే... అది మనం చేసే చాలా పెద్ద తప్పు. వ్యక్తిగత దూషణకు గురైన ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా నేను మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి చెందిన పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. 
 
అంతేగాకుండా అసెంబ్లీ ఘటన తన హృదయాన్ని కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోలో రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం... దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేద్దాం. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరాలకు బంగారు బాట వేసేలా, మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా" అని జూనియర్ రాజకీయ నేతలకు విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments