Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ వేదికపై ఇద్దరు భారతీయులు కనిపించారు.... ఎన్టీఆర్

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (09:58 IST)
ఆస్కార్ వేదికపై తనకు ఇద్దరు భారతీయులు.. ఇద్దరు తెలుగు వారు కనిపించారని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. విష్వక్సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం "దాస్ కా ధమ్కీ" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ మాట్లాడుతూ, "ఆర్ఆర్ఆర్" చిత్రం ఈ రోజున ప్రపంచపటంలో నిలవడానికి, ఆస్కార్ అవార్డును కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు రాజమౌళి ఎంత కారణమో, సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఎంత కారణమో ఆ పాటను ఆదరించిన ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు, వారి అభిమానం అంతే కారణమన్నారు. 
 
"ఆ అవార్డును సాధించింది మీరే.. మీ అందరి బదులుగా మేం అక్కడికి వెళ్లాం. మా అందరి బదులుగా కీరవాణి, చంద్రబోస్‌లు వేదికపై నిల్చొన్నారు. ఆ స్టేజ్‌పై తనకు కీరవాణి - చంద్రబోస్‌లు కనిపించలేదు. ఇద్దరు భారతీయులు కనిపించారు. ఇద్దరు తెలుగువారు కనిపించారు. వేదికపై తెలుగుదనం ఉట్టిపడింది" అని అన్నారు. 
 
ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన మీకు ఎలా అనిపించిందోగానీ రెండు నేత్రాలతో ప్రత్యక్షంగా చూడటం మరిచిపోలేని అనుభూతినిచ్చింది. మళ్లీ అంతటి అనుభూతిని ఎప్పటికి పొందుతామో తెలియదు. 'ఆర్ఆర్ఆర్' ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమా మరింత ముందుకుసాగాలని ఆశిస్తున్నాను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments