Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ వేదికపై ఇద్దరు భారతీయులు కనిపించారు.... ఎన్టీఆర్

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (09:58 IST)
ఆస్కార్ వేదికపై తనకు ఇద్దరు భారతీయులు.. ఇద్దరు తెలుగు వారు కనిపించారని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. విష్వక్సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం "దాస్ కా ధమ్కీ" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ మాట్లాడుతూ, "ఆర్ఆర్ఆర్" చిత్రం ఈ రోజున ప్రపంచపటంలో నిలవడానికి, ఆస్కార్ అవార్డును కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు రాజమౌళి ఎంత కారణమో, సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఎంత కారణమో ఆ పాటను ఆదరించిన ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు, వారి అభిమానం అంతే కారణమన్నారు. 
 
"ఆ అవార్డును సాధించింది మీరే.. మీ అందరి బదులుగా మేం అక్కడికి వెళ్లాం. మా అందరి బదులుగా కీరవాణి, చంద్రబోస్‌లు వేదికపై నిల్చొన్నారు. ఆ స్టేజ్‌పై తనకు కీరవాణి - చంద్రబోస్‌లు కనిపించలేదు. ఇద్దరు భారతీయులు కనిపించారు. ఇద్దరు తెలుగువారు కనిపించారు. వేదికపై తెలుగుదనం ఉట్టిపడింది" అని అన్నారు. 
 
ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన మీకు ఎలా అనిపించిందోగానీ రెండు నేత్రాలతో ప్రత్యక్షంగా చూడటం మరిచిపోలేని అనుభూతినిచ్చింది. మళ్లీ అంతటి అనుభూతిని ఎప్పటికి పొందుతామో తెలియదు. 'ఆర్ఆర్ఆర్' ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమా మరింత ముందుకుసాగాలని ఆశిస్తున్నాను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments