Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరి కోసమే ఉన్నాం.. ఎవరికీ భయపడే స్వభావం కాదు.. జీవిత రాజశేఖర్

ఠాగూర్
సోమవారం, 4 మార్చి 2024 (12:41 IST)
తమ ఇద్దరు పిల్లలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారని, తమ కంటే వాళ్ల ఇద్దరి కెరీర్ ఎంతో ముఖ్యమని, అందుకే గత కొన్ని రోజులుగా తగ్గువగా మాట్లాడుతున్నట్టు సినీ నటి జీవిత రాజశేఖర్ తెలిపారు. ఆమె తాజాగా మాట్లాడుతూ, తాను, రాజశేఖర్‌లు ఇద్దరూ కొన్ని విషయాల్లో నిర్మొహమాటంగా మాట్లాడుతామని, ఈ కారణంగా తామిద్దరం మేమిద్దరం పలు సమస్యలను ఎదుర్కొన్నామని తెలిపారు. 
 
"నేను, రాజశేఖర్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. అందువల్ల కొన్ని సమస్యలు ఎదురైన మాట నిజమే. మా ఇద్దరి వరకు అలా నడిచింది. కానీ, ఇపుడు పిల్లలు ఇద్దరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మేమంటే పడనివారి వల్ల మా పిల్లల కెరియర్ దెబ్బతినకూడదు. మా కారణంగా వాళ్ళకి ఇబ్బందులు ఎదురుకాకూడదు. ఈ విషయాన్ని గురించి నేను రాజశేఖర్ కలిసి మాట్లాడుకున్నాం"s అని వివరించారు.
 
"నేను, రాజశేఖర్ చాలా కెరియర్ చూశాం. ఇక ఇపుడు పిల్లల వంతు. మేము లేకుండా వాళ్ళు చాలా దూరంగా ప్రయాణించవలసి ఉంటుంది. అందువల్ల వాళ్ల కెరియర్‌పై ఎక్కువగా దృష్టిపెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేు కాస్త తక్కువగా మాట్లాడుతున్నాను. దీనికి కారణం.. మా ఇద్దరు పిల్లల కెరియర్‌ను దృష్టిలో పెట్టుకోవడం వల్లే. అయితే, భయపడటం కాదు.. తమది ఎవరికీ భయపడే స్వభావం కూడా కాదు" అని జీవిత రాజశేఖర్ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments