Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా ఓ వ్యాపారంగా మారిపోయింది.. సినిమా వాళ్లు బరితెగించారు: జయాబచ్చన్

ఇప్పటి సినిమా పచ్చి బిజినెస్‌గా మారిందని, ఒక్క మాటలో చెప్పాలంటే సినిమావాళ్లు బరితెగించారని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ఫిలిం మేకర్లు గతంలో కళా

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (11:05 IST)
ఇప్పటి సినిమా పచ్చి బిజినెస్‌గా మారిందని, ఒక్క మాటలో చెప్పాలంటే సినిమావాళ్లు బరితెగించారని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ఫిలిం మేకర్లు గతంలో కళాఖండాలను రూపొందించేవారని... కానీ, ఇప్పటి ఫిలిం మేకర్లకు అది పట్టడం లేదని, కేవలం నంబర్లు, బిజినెస్ మాత్రమే చూసుకుంటున్నారన్నారు. 
 
తొలి వారం రికార్డులు, రూ.100 కోట్ల కలెక్షన్లు... ఇప్పుడంతా వీటినే చూస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ తనకు అర్థం కావని, అందుకే ఇలాంటి చోట తాను ఇమడలేక పోతున్నానని చెప్పారు. తెరనిండా పాశ్చాత్య పోకడలు కనిపిస్తున్నాయని, పొట్టి పొట్టి దుస్తులే తప్ప భారతీయత ఎక్కడుందని ప్రశ్నించారు. 
 
50, 60 దశకాల్లో సినిమాల్లో జీవం ఉట్టి పడేదని చెప్పారు. ఆ రోజుల్లో సినిమాల్లో ఒక హీరోయిన్, ఒక వాంప్ ఉండేవారని... ఇప్పుడు వాంప్ ల అవసరం లేదని, హీరోయిన్లే వాంప్‌లు చేయాల్సినవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. అలీగఢ్, మసాన్ లాంటి సినిమాలు నిజమైన భారతీయ సినిమాలని... అలాంటి సినిమాలను భారతీయులు ఆదరిస్తారని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments