Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ సైనికుడు 'బాహుబలి'ని పిలిచి కరోనా వైరస్‌ను తన్ని తరమండి : ఆర్జీవీ

SS Rajamouli
Webdunia
గురువారం, 30 జులై 2020 (08:52 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన గత రాత్రి స్వయంగా ట్వీట్ చేయడంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలంరేగింది. రెండు రోజుల క్రితం తాను, తన కుటుంబసభ్యులు స్వల్ప జ్వరంతో బాధపడ్డామని, జ్వరం తగ్గిన తర్వాత కొవిడ్ పరీక్షలు చేయగా, అందులో పాజిటివ్ అని వచ్చినట్టు ఆయన తన ట్వీట్‌‌లో పేర్కొన్నారు.
 
అంతేకాకుండా, ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు తామంతా హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు. తమలో కరోనా లక్షణాలు లేనప్పటికీ నిబంధనలు పాటిస్తున్నామని, జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. యాంటీబాడీలను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తామని ఆయన ప్రకటించారు. 
 
అయితే, ఈ విషయం తెలిసిన అనేక మంది సినీ ప్రముఖులు రాజమౌళిని పరామర్శిస్తూ, ధైర్యం చెప్పేలా ట్వీట్లు చేశారు. ఇలాంటివారిలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారు. "మీరు, మీ కుటుంబ సభ్యులు త్వరలోనే కోలుకుంటారని, కాకపోతే అంతకంటే ముందు మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనా వైరస్‌ను తన్నాలని చెబితే సరిపోతుందని" అంటూ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వర్మపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ తూర్పారబడుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments