Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళితో నా సినిమా వుంటుంది... స్పైడర్ హీరో మహేష్ బాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈనెల 27వ తేదీన రిలీజ్ కానున్న స్పైడర్ మూవీకి సంబంధించి టిక్కెట్ల బుకింగ్స్ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సిని

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (09:21 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈనెల 27వ తేదీన రిలీజ్ కానున్న స్పైడర్ మూవీకి సంబంధించి టిక్కెట్ల బుకింగ్స్ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సినిమా బాహుబలి కలెక్షన్లను బ్రేక్ చేస్తుందని టాక్ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడాడు. ''స్పైడర్'' సినిమాను మురుగదాస్ అద్భుతంగా తెరకెక్కించారని మహేశ్ బాబు చెప్పుకొచ్చాడు. మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. 
 
అలాగే బాహుబలి మేకర్ రాజమౌళితో సినిమా చేయనున్నట్లు వస్తున్న వార్తలపై కూడా మహేష్ బాబు స్పందించారు. రాజమౌళితో కలిసి తాను సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆయనకి కమిట్ మెంట్స్ వున్నాయని... తనకు కూడా కొన్ని కాల్షీట్స్ వుండటంతో కొంత టైమ్ తీసుకున్నాక ఈ సినిమాను కలిసి చేస్తామని చెప్పుకొచ్చాడు.
 
ఇకపోతే.. రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమా 2018లో ప్రారంభమై 2019లో రిలీజ్ అవుతుందని.. అంతకుముందు కొరటాలతో భరత్ అనే నేను, మహేష్ 25 (త్రివిక్రమ్‌తో) సినిమాలను ప్రిన్స్ పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని వంటి హీరోలతో కలిసి పనిచేసిన రాజమౌళి త్వరలో తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే కాదు.. స్టేషన్‌లలో కూడా రద్దీనే రద్దీ

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments