Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గౌతమీపుత్ర శాతకర్ణి' దర్శనిర్మాత ఇళ్లపై ఐటీ దాడులు.. బాలకృష్ణకు మినహాయింపు

'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం దర్శక నిర్మాతలు, పంపిణీదారుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డైరెక్టర్ క్రిష్, నిర్మాత వై.రాజీవ్ రెడ్డిల ఇళ్ళు, ఆఫీసులపై మంగళవారం రాత్రి ఆకస

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (10:57 IST)
'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం దర్శక నిర్మాతలు, పంపిణీదారుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డైరెక్టర్ క్రిష్, నిర్మాత వై.రాజీవ్ రెడ్డిల ఇళ్ళు, ఆఫీసులపై మంగళవారం రాత్రి ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, బెబో శ్రీనివాస్ సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా వసూళ్ళ వివరాలను రహస్యంగా ఉంచారు. ఈ చిత్ర నైజాం ప్రాంత హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ సుధాకర రెడ్డి ఇంటిలో సుమారు ఎనిమిది గంటల పాటు సోదాలు జరిగాయట. 
 
ఇదిలావుండగా ఈ చిత్ర హీరో బాలకృష్ణ ఇంట్లో మాత్రం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించేలేదు. దీనిపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఈ చిత్ర యూనిట్ సభ్యులపై జరిగినవి ఐటీ దాడులు కావనీ, కేవలం సర్వేలు మాత్రమేనని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా వసూళ్ళకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments