Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

ఠాగూర్
బుధవారం, 22 జనవరి 2025 (14:01 IST)
తెలుగు చిత్రపరిశ్రమను ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గత రెండు రోజులుగా ప్రముఖ నిర్మాతల గృహాలు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. బుధవారం 'పుష్ప' చిత్ర దర్శకుడు సుకుమార్ నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. 'పుష్ప' చిత్రానికి సుకుమార్ రైటింగ్స్ పేరుతో దర్శకుడు సుకుమార్ భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో హైదరాబాద్ నగరంలోని సుకుమార్ నివాసంలో బుధవారం తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు చేశారు. 
 
గత యేడాది డిసెంబరు నెలలో విడుదలైన 'పుష్ప-2' మూవీ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు, ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు జరిగిన విషయం తెల్సిందే. 
 
గత రెండు రోజులుగా ఐటీ అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, ఈ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ నివాసాలతో పాటు మ్యాంగో మీడియా సంస్థ, సత్య రంగయ్య ఫైనాన్స్, నిర్మాత అభిషేక్ అగర్వాల్‌‍లతో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీల్లోనూ ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు కీలక దస్తావేజులను వారు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- అంతా భారత్ చేసిందా.. వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments